గత ఏడాది సృష్టించిన కరోనా విలయ తాండవం వలన తొమ్మిది నెలల పాటు థియేటర్స్ మూత పడ్డాయి.దీంతో చిన్న హీరోల సినిమాలే కాదు పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో మళ్లీ పాత పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్స్ మూతపడడం, రానున్న రోజులలో పెద్ద సినిమాలు విడుదల కానుండడంతో చిన్న సినిమాలు ఓటీటీలని ఆశ్రయిస్తున్నాయి.
ఇప్పటికే అనసూయ నటించిన థ్యాంక్ యయూ బ్రదర్ అనే చిత్రం ఆహాలో విడుదలకి సిద్దం కాగా, ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి కూడా ఆహాలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. చిత్రంలో రచితా రామ్తో పాటు ఒక కీలక పాత్రలో అజయ్ ఈ సినిమాలో నటిస్తోన్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు