గీతానంద్, మిత్రశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ను కథానాయిక సన్నీ లియోన్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్లుక్..‘రాజా హే రాజా..’ అనే కాలేజ్ పాటకు మంచి స్పందన లభిస్తోంది. టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. నవతరం రొమాంటిక్ కథాంశమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, నిర్మాణ సంస్థ: శ్రీపిక్చర్స్, రచన-దర్శకత్వం: దయానంద్.