తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలు కాగా, ఇది తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ క్రమంలో ప్రతి ఏడాది సరికొత్తగా బిగ్ బాస్ షోని ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ షో కార్యక్రమం డిసెంబర్ 19న ముగియనున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమం కోసం 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్లోకి అడుగుపెట్టగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు.
మానస్, సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ ఈ ఐదుగురిలో ఒకరు కప్ కొట్టనుండగా, సన్నీ మాత్రం ఎలా అయిన కప్ తీసుకెళతానని ధీమా వ్యక్తం చేశారు. వంద ఎపిసోడ్లో మానస్- సన్నీఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటుండగా, సన్నీ.. టెన్షన్గా ఉంది, ఎలాగైనా టైటిల్ గెలవాలి, మా అమ్మకు కప్ ఇస్తరా బయ్.. ఇది ఫిక్స్.. ఏదైనా కానీ.. బరాబర్ కప్పు ఇస్తా.. అంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. టెన్సన్ ఏం పడకురా అని మానస్ సన్నీకి ధైర్యం చెప్పాడు.
మరో బ్యాచ్ షణ్ముఖ్- సిరి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అందరికి క్లియర్ చేయవలసింది ఒకటి ఉంది. నీకు దెబ్బ తగిలిన తర్వాత మిగతా హౌజ్మేట్స్ ఎవరిని పట్టించుకోవడం లేదు. నేను నిన్నే పట్టించుకుంటున్నాను… అది అలాగే కంటిన్యూ అయిపోయింది.. ఏది జరిగినా మన మంచికే అని చెప్పాడు షణ్ముఖ్. ఇంతలో శ్రీరామ్ రావడంతో.. జెస్సీ గాడు మాకు రాడ్లు దింపేశాడు.. కొట్టడం ఒకటే లేటు.. అన్నట్టుగా మాట్లాడాడు.. అంటూ సిరి, షణ్ముఖ్లు శ్రీరామ్తో చెప్పుకొచ్చారు.