Sukumar| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది. దీంతో చెర్రీ ఇప్పుడు బుచ్చిబాబు ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగా, సుకుమార్తో చేయనున్న సినిమాకి సంబంధించి కసరత్తులు చేస్తున్నట్టుగా అర్ధమవుతుంది.ఇక ఈ సినిమాలో సమంత కథానాయికరగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. రంగస్థలం కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ‘రంగస్థలం’ విడుదల సమయానికి రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ వరకు వెళ్లలేదు. అదే విధంగా దర్శకుడు సుకుమార్ కూడా ‘పుష్ప సినిమా తీయలేదు. ఫుష్ప ఫ్రాంచైజీతో సుకుమార్ స్టేటస్ కూడా పెరిగింది.
ఇక సమంత విషయానికి వస్తే ఈ అమ్మడు ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీసులు చేయడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇక ఇందులో రష్మిక మందాన కూడా నటిస్తుందని టాక్. ఆమెకి ఈ మధ్య వరుస హిట్స్ రావడంతో ఆమె క్రేజ్ కూడా మరింతగా పెరిగింది. మరి ఇంత పాలపులారిటీ ఆర్టిస్ట్లు అందరు కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరికి ముగ్గురికి జాతీయ స్థాయిలో, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.వారు సినిమా చేస్తున్నారని తెలిసి విశ్లేషకులు కూడా మూవీకి సంబంధించి అనేక లెక్కలు వేసుకుంటున్నారు.
సుకుమార్ సెంటిమెంట్ ప్రకారం ఒక సారి తన సినిమాల్లో నటించిన హీరోయిన్ను మళ్లీ అవకాశం ఇవ్వలేదు. కానీ.. గ్లోబల్ స్టార్ చరణ్ కోసం సుకుమార్ తొలిసారి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రష్మికని తీసుకున్నాడట.రష్మిక సుకుమార్తో కలిసి పుష్ప, పుష్ప2 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.