Pushpa : The Rule | మోస్ట్ అవెయిటెడ్ టాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa : The Rule ). పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా వస్తున్న ఈ ప్రాజెక్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కొన్ని రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో ఐటీ దాడుల నేపథ్యంలో షూటింగ్ను ఆపేశారన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఇతర సినిమాల షూటింగ్స్పై ఫోకస్ పెట్టారట.
మరి పుష్ప 2 షూటింగ్ ప్రస్తావన తెరపై రాగా.. మారేడుమిల్లి ఫారెస్ట్ ప్రాంతంలో షూటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పుష్ప 2 చిత్రీకరణ నెమ్మదించిందన్న పుకార్లలో నిజం లేదని చిత్రయూనిట్ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ బంజారాహిల్స్ లో ఉన్నాడు. ప్రస్తుతానికి షూటింగ్స్ ఏమీ లేవు. అంతేకాదు ఆహా కోసం యాడ్స్ చేసే అసైన్మెంట్స్ కు కూడా బన్నీ సంతకం చేశాడని సమాచారం. దీంతోపాటు ముంబై, హైదరాబాద్లో వెడ్డింగ్ ఈవెంట్స్ కు హాజరు కానున్నాడట. ఇవాళ రాంచరణ్-ఉపాసన కూతురును చూసేందుకు అపోలో ఆస్పత్రికి కూడా వెళ్లాడు బన్నీ.
బన్నీ వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మరి పుష్ప2 షూటింగ్ సంగతేంటని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఇదిలా ఉంటే మరోవైపు అల్లు అర్జున్- రష్మిక మందన్నా త్వరలోనే పుష్ప 2 తాజా షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నారని వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. అల్లు అర్జున్ రానున్న రోజుల్లో ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రస్తుతం పలువురు దర్శకులతో కొత్త కథలను కూడా వింటున్నాడన్న టాక్ కూడా ఉంది. మొత్తానికి బన్నీ పుష్ప 2 షెడ్యూల్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నాడన్న దానిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
సీక్వెల్ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఫస్ట్ పార్టును మించిన బడ్జెట్తో వస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా మెరిసిన కన్నడ సోయగం రష్మిక మందన్నా రెండో పార్టులో కూడా సందడి చేయనుంది. పుష్ప.. ది రైజ్కు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్కు కూడా అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.