Karthik Dandu | అదేంటో కొంత మంది.. లోపల ఎన్ని బాధలు, కష్టాలున్నా పైకి మాత్రం ఆనందంగా కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ఆ నవ్వు వెనుకాల ఎంతో దుఃఖం ఉందో ఎవరో చెబితే కాని తెలియదు. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కథ వింటే అలానే అనిపిస్తుంది. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. సుక్కు చెప్పిన మాటలు వింటుంటే గుండెలు బరువెక్కిపోయాయి. విరూపాక్ష డైరెక్టర్ అన్ని కష్టాలను దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాడా అని తెలిస్తే షాకింగ్గా అనిపిస్తుంది. కార్తీక్ దండూ విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా పరిచమవుతున్నాడు.
కార్తీక్ దండూ సుకుమార్ శిష్యుడు. సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, గోస్ట్ రైటర్గా పనిచేశాడు. కాగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ తన శిష్యుడి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కార్తీక్ చావు అంచులదాకా వెళ్లి వెనక్కి వచ్చినట్లు చెప్పాడు. కార్తీక్ తనను కలిసే సమయానికి తన జీవితం చాలా చిన్నదని, అప్పటికి ఐదారేళ్లకు మించి అతను బతికే చాన్స్ లేదని వైద్యులు చెప్పారని సుక్కు వెల్లడించాడు. కార్తీక్కు ఒక అనారోగ్య సమస్య ఉండేదని.. దాని వల్ల అతడి ప్లేట్లెట్స్ పడిపోవడం జరిగేవని, అలాంటి స్టేజీ నుంచి పోరాడి విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేసే స్థాయికి రావడం చిన్న విషయం కాదని సుక్కు తెలిపాడు. కార్తీక్ తను అంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికి చనిపోయేలోపు ఒక సినిమా డైరెక్ట్ చేసి వెళ్లిపోవాలని అనుకున్నాడని చెప్పాడు.
కార్తీక్ చేసిన పోరాటం, ఆయన తల్లి ప్రార్థనల వల్ల అదృష్టం కొద్ది ఆ సమస్య నుంచి కార్తీక్ బయపడ్డాడని సుక్కు తెలిపాడు. కథ బాగా చెప్పడం వచ్చిన వాడు దర్శకత్వం కూడా బాగా చేస్తాడని, కార్తీక్కు ఆ నైపుణ్యం ఉందని అన్నాడు. విరూపాక్ష సినిమాను కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తాను చేసింది పెద్దగా ఏమి లేదని, కార్తీక్ను పుష్ చేయడం మాత్రమే చేశానని సుక్కు చెప్పుకొచ్చాడు.
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. సుకుమార్ కథ- స్క్రీన్ప్లే అందించాడు.