వంశీ, అనిల్, కృష్ణప్రియ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘సుగ్రీవ’. మధుసూదన్రెడ్డి, ఏడుకొండలు రెడ్డి నిర్మాతలు. కొత్తపల్లి నగేష్ దర్శకుడు. శుక్రవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. రెండు జంటల ప్రేమకథతో అందమైన దృశ్యకావ్యంగా ఉంటుంది. ఈ నెల 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సుగ్రీవ అనే టైటిల్ ఎందుకు పెట్టామన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. తమ బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. తనికెళ్లభరణి, ఆనంద్ చక్రపాణి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్రాజు బొబ్బిలి.