సుధీర్బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. నవంబర్ 7న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శనివారం ‘జో లాలి జో’ అనే పాటను విడుదల చేశారు. రాజీవ్రాజ్ స్వరపరచిన ఈ పాటకు శ్రీమాన్ కీర్తి సాహిత్యాన్ని అందించారు. పావని వాసా, రాజీవ్ రాజ్ ఆలపించారు.
ఈ లాలి పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. దుష్టశక్తికి, దైవత్వానికి మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇందులో హీరో సుధీర్బాబు లోకరక్షకుడి పాత్రలో కనిపిస్తాడని దర్శకుడు తెలిపారు. జీ స్టూడియోస్, ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.