బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరో వారం రోజులలో ముగియనుంది. ప్రస్తుతం హౌజ్లో ఉన్న ఆరుగురు హౌజ్మేట్స్ ఫినాలేకు చేరుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. అయితే శనివారం రోజు నాగార్జున గ్యాంగ్ లీడర్ పాటతో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి శుక్రవారం జరిగిన సన్నవేశాలను చూపించారు. సన్నీ, శ్రీరామ్ గార్డెన్ ఏరియాలో కూర్చొని పలు విషయాలపై ముచ్చటించుకున్నారు.
ఉదయాన్నే కాజల్, మానస్, శ్రీరామ్లు టేబుల్పై కూర్చొని ముచ్చటించుకున్నారు. సన్నీకి నాకు డిస్కషన్ అయిపోయింది.. నీకు ఏమైందని శ్రీరామ్ అడగ్గా.. నేను చెప్తా అని మానస్ జరిగిన దానిపై వివరణ ఇచ్చాడు. ఓట్ ఫర్ మి కోసం బిగ్ బాస్ హౌస్ కాల్ తీసుకోండి అని అన్నప్పుడు నువ్ ఎందుకు మీమిద్దరం డిస్కస్ చేసుకుంటాం అని అన్నావ్ అనేది ఆమె పాయింట్’ అని చెప్పాడు.
రెండో పాయింట్ నేను చెప్తా అని కాజల్ మొదలుపెట్టింది.. నీకు క్రెడిట్ ఇవ్వడం కంటే నాకు క్రెడిట్ తీసుకోవడం ఇష్టం. హౌస్ కాల్ అంటే.. హౌస్లో నేను ఉన్నా కాబట్టే అందుకే నేను అడిగా.. అని చెప్పింది కాజల్. దీంతో ఫైర్ అయిన కాజల్.. కావాలని సింపథీ ప్లే చేస్తున్నావ్.. బ్రదర్ అని పిలవడం, ఏడవడం ఇవన్నీ సింపథీ కాదు. నన్ను బ్రో అని అనొద్దు.. సింపథీ గేమ్ ప్లే చేయొద్దు’ అని మళ్లీ గొడవపడ్డాడు. దీంతో కాజల్ కూడా శ్రీరామ్కి గట్టిగానే క్లాస్ పీకింది. కొద్ది సేపు ఇద్దరు గట్టిగానే గొడవ పడ్డారు.