Dhruv | స్టార్ కిడ్గా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సులభమే. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలో మంచి యాక్టర్గా ప్రేక్షకుల మెప్పు పొందడం అంటే అంత సులభమేమి కాదు. 2019లో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ (Aditya Varma) సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ (Dhruv). గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ధ్రువ్ గతేడాది మహాన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ మరో లీడ్ రోల్లో నటించాడు.
విక్రమ్ గ్యాంగ్స్టర్గా కనిపించగా.. ధ్రువ్ పోలీసాఫీసర్గా నటించాడు. మహాన్ డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ధ్రువ్ నటనకు మంచి మార్కులు పడినప్పటికీ.. ఈ సినిమా మాత్రం ధ్రువ్ కోరుకున్న హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇక ఎలాగైన బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నాడట ధ్రువ్. ఈ యంగ్ యాక్టర్ డైరెక్టర్ మారి సెల్వరాజ్తో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మామన్నన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే ధ్రువ్ ప్రాజెక్ట్ను సెట్స్పైకి తీసుకెళ్లనున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. మరోవైపు మారి సెల్వరాజ్ సినిమా షురూ చేసే కంటే ముందే.. Dada డైరెక్టర్ గణేశ్ బాబుతో ఓ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నాడని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని చర్చ నడుస్తోంది. మరి ధ్రువ్ వీరిలో ఏ డైరెక్టర్తో తొలి సక్సెస్ను అందుకుంటాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.