భారీ లైనప్లోని ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు స్టార్ హీరో ప్రభాస్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమా కీలక షెడ్యూల్ను తాజాగా పూర్తి చేశారు ప్రభాస్. ఇటీవల హైదరాబాద్లో వారం పాటు సాగిన ఈ చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ సోలో సన్నివేశాలు ఎక్కువగా ఉండగా..కొన్ని హీరోయిన్ దీపికా పడుకోన్తో కలిసి ఉన్నాయి.
ఈ షెడ్యూల్ను ప్రభాస్ ఉత్సాహంగా పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. ఈ సన్నివేశాలన్నీ కథకు చాలా ముఖ్యమైనవని, జాగ్రత్తలతో వీటిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా సాంకేతికంగా ఉన్నత విలువలతో ఉండనుందీ సినిమా. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా తుది హంగులు అద్దుకుంటుండగా..‘సలార్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ స్టార్ ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.