రాజ్తరుణ్, వర్ష బొల్లమ్మ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకుడు. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘పదా.. పదమంటున్నది పసిప్రాయం.. సదా నిన్ను చేరేటి ఆరాటం..’ అనే గీతాన్ని మంగళవారం కథానాయిక రష్మిక మందన్న విడుదలచేసింది. స్వీకర్ అగస్తి స్వరాలను అందించారు. రెహమాన్ సాహిత్యాన్ని సమకూర్చగా యాజిన్ నిజార్ ఆలపించారు. నలుగురు స్నేహితుల రోడ్ ట్రిప్ నేపథ్యంలో అందమైన లొకేషన్స్లో ఈ పాటను చిత్రీకరించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రాహుల్ అనే స్టాండప్ కమెడీయన్ కథ ఇది. రాజ్తరుణ్, వర్ష బొల్లమ్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్.