SSMB28 Movie | మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘SSMB28’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు కమర్షియల్గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పూజా కార్యక్రమాలు జరుపకున్న ఈ చిత్రం సెప్టెంబర్లో షూటింగ్ మొదలు పెట్టింది.
ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే కారణాలేంటో తెలియదు కానీ షూటింగ్ను ఆపేశారు. ఇక చిత్రబృందం మరోసారి కథలో మార్పులు చేర్పులు చేసి కొత్తగా షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. దాంతో షూటింగ్ను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ లోపు మహేష్ తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దాంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా నిర్మాత నాగవంశీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాతే మొదలు కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత మార్చి వరకు లాంగ్ షెడ్యూల్ను ప్లాన్ చేస్తు్న్నారట. దాదాపు 60రోజులు బ్రేక్స్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరపనున్నారట. పూజా హెగ్డే హీరోయిన్గా నటించినున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.