SSMB 29 | ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమా రేంజ్ను ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఇక ఈ సినిమా అనంతరం రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో మహేశ్బాబు (Mahesh Babu)తో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ఎస్ఎస్ఎంబీ 29గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కు వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ బింగి, ఎడిటర్గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే నెలలో మూవీ కూడా లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.
#SSMB29 #SSRMB pic.twitter.com/SyPpDQIK6x
— Aakashavaani (@TheAakashavaani) February 12, 2024
యాక్షన్ అడ్వెంచరస్గా ఈ సినిమా ఉండబోతుండగా.. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మరోవైపు సినిమా కోసం తన లుక్ను కూడా మార్చుకున్నారు మహేశ్ బాబు. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం.