టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (MaheshBabu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28). డిసెంబర్ లో ఎస్ఎస్ఎంబీ 28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ప్రకారమే తాజా స్టిల్స్ తో ఎస్ఎస్ఎంబీ 28 గురించి చెప్పేసింది మహేశ్ టీం.
త్వరలో షూటింగ్ షురూ కానుండగా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా టీం మెంబర్స్ దుబాయ్కు వెళ్లారు. అయితే దుబాయ్కు వెళ్లే ముందు ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ నివాసంలో ఏర్పాటు చేసిన డిన్నర్లో మహేశ్ బాబు, త్రివిక్రమ్, ఎస్ థమన్, నమ్రత, మెహర్ రమేశ్ పాల్గొన్నారు. డిన్నర్ సమయంలో తీసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఎస్ఎస్ఎంబీ 28 లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో రాబోయే ఐటెం సాంగ్లో కన్నడ భామ రష్మిక మందన్నా మెరువనుందని టాక్ నడుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఎస్ఎస్ఎంబీ 28 టీం డిన్నర్..
"Little moments in my big city of dreams ♥️♥️♥️ Thanks my Shazia for the best homemade meal!! 🤗♥️ #Mumbai #Friends #HomeFood "
– #NamrataShirodkar via #Instagram@urstrulyMahesh #Trivikram @MusicThaman @MeherRamesh @avigowariker @Shaziaqg pic.twitter.com/k6g4p6Pxa9
— BA Raju's Team (@baraju_SuperHit) December 7, 2022