Sriranganeethulu | టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు. ఈ సినిమాకు ప్రవీణ్కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమా ఇదని దర్శకుడు తెలిపాడు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు..ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుందని వెల్లడించాడు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి.