ఇటీవల ‘మెర్రీ క్రిస్మస్’ను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తాజాగా మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. అయితే తన తదుపరి చిత్రం ‘ఇక్కీస్’ (ఇరవై ఒకటి)లో తాజా మార్పును వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోగా వరుణ్ ధావన్ నటించాల్సి ఉండగా, ఆ స్థానాన్ని ఇప్పుడు అగస్త్య నందతో భర్తీ అయ్యింది. ‘ది ఆర్చీస్’తో నటనా రంగ ప్రవేశం చేసిన అగస్త్య నంద ఇప్పుడీ ఈ ఛాన్స్ కొట్టేశాడు. అయితే, అనూహ్యంగా హీరో మార్పు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు శ్రీరామ్ రాఘవన్.
‘కరోనా కంటే ముందు అనుకున్న ప్రాజెక్టు ‘ఇక్కీస్’ (#21). ప్రారంభంలో టైటిల్ రోల్ కోసం వరుణ్ ధావన్ను అనుకున్నాం. 1971 యుద్ధం నేపథ్యానికి వ్యతిరేకంగా, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ అనే యుద్ధ వీరుడి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది ఒక పెద్ద నిర్మాణం. యుద్ధ సన్నివేశాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇది యువ జవాన్ ఖేతర్ పాల్ కథ. కాబట్టి కథ, కథనాల పరంగా చూస్తే ఈ సినిమాలో అతని బాల్యానికి ప్రాధాన్యం ఉండబోదు. అతిగా హీరోయిక్ ప్రదర్శన ఈ కథలో అవసరం ఉండదు. ఇందుకు అగస్త్య నంద సరిపోతాడని భావించాం’ అని వివరించారు.