స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రంలో శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. మరో ముఖ్య పాత్రలో హీరో రవితేజ కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పోర్ట్ ఏరియా బ్యాక్డ్రాప్లో సాగే కంప్లీట్ కమర్షియల్ మూవీ ఇది.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి..’ పాటను విడుదల చేశారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించి స్వరపర్చారు. జస్ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్ పాడారు. యూరప్లో చిత్రీకరించిన ఈ పాట లొకేషన్స్, చిరంజీవి, శృతి హాసన్ డాన్స్ మూవ్మెంట్స్ సినిమాలో ఆకర్షణ అవుతాయని చిత్రబృందం చెబుతున్నారు.