Sriranga neethulu | టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు (Sriranga neethulu). ఈ సినిమాకు ప్రవీణ్కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది.
ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘ఎక్కడుండాలని ఎక్కడున్నావో’ (ekkadundalani ekkadunnavo) అని సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ్ పాడగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్ చూస్తే.. నేటి యువత ఎదుర్కోనే పరిస్థితుల ఆధారంగా సినిమా వస్తున్నట్లు తెలుస్తుంది.
యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే ఈ చిత్రం అంటున్నాడు దర్శకుడు ప్రవీణ్కుమార్. ఇక త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి.