బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. కేవలం ఒకే ఒక వారం మిగిలి ఉంది. హౌజ్లో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆదివారం రోజు జరిగిన కార్యక్రమంలో నాగార్జున హౌజ్మేట్స్తో సరదా గేమ్స్ ఆడించి టాప్ 5 ఫైనలిస్ట్లు ఎవరో తెలియజేశారు. ముందుగా సండే ఫన్డే లో భాగంగా పాటలను కనిపెట్టే ఆటను ఆడించాడు.
చిట్టీలో వచ్చిన పాటను.. పాడకుండా, స్టెప్పులు వేయకుండా యాక్ట్ చేసి మాత్రమే చూపించాలి. అవతలి వాళ్లు గెస్ చేయాలి అని చెబుతూ హౌజ్మేట్స్ని రెండు టీంలుగా విభజించాడు. శ్రీరామచంద్ర, కాజల్, షన్ను ఒక టీం. మిగిలిన మానస్, సిరి, సన్నీలను మరో టీంగా విడగొట్టారు. ఇందులో మొదటగా కాజల్ వచ్చింది. ఆమెకు నడక చూస్తే వయ్యారం అంటూ జెమిని సినిమాలోని పాట వచ్చింది. ఆ పాటను శ్రీరామచంద్ర ఇట్టే కనిపెట్టేశాడు.
ఆ తరువాత అవతలి టీం నుంచి మానస్ రాగా.. అతనికి నడక కలిసిన నవరాత్రి అనే పాట రాగ.. సన్నీ ఈజీగా గెస్ చేసేశాడు. ఆ తరువాత శ్రీరామచంద్రకు నీ కన్ను నీలి సముద్రం అనే పాట రాగా షన్ను గెస్ చేశాడు. అటుపై సన్నీకి చెన్నకేశవ రెడ్డి సినిమాలోని నీ కొప్పులో నా మల్లెతోట అనే పాట రాగా.. దాన్ని ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు. ఆ తరువాత షన్నుకి కాలేజ్ పాపల బస్సు అనే పాట రాగా దాన్ని కూడా ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు.
ఆ తరువాత సిరికి కోపమా నా పైన అనే పాట రాగా.. సన్నీ వెంటనే గెస్ చేశాడు. ఆ తరువాత కాజల్కు మాస్ సినిమాలోని నాతో వస్తావా? అనే పాట రాగా షన్ను గెస్ చేసేశాడు. మానస్కు హల్లో హల్లో అంటూ వచ్చిన పాటను సరిగ్గా కనిపెట్టలేకపోయారు.అలా మొత్తానికి శ్రీరామచంద్ర టీం విన్ అయింది.