బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌజ్మేట్స్కి పలు టాస్క్లు ఇస్తూ అందులో గెలిచిన వారికి ఓట్లు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. రీక్రియేట్ చేసే టాస్కులో షణ్ను గెలిచి ఓట్లు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని గెలుపొందాడు. అలాగే నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్, మానస్ ఇద్దరికి టై అయింది. ఇందులో ఎవరు ‘ఓట్ ఫర్ మి’ పొందుకుని ప్రేక్షకుల్ని ఓట్లు ఎవరు అడుగడానికి అర్హులో హౌస్లో ఉన్న ఇంటి సభ్యులు నిర్ణయించి చెప్పాలన్నారు.
షణ్ముఖ్.. శ్రీరామ్కి టికెట్ టు ఫినాలే ఉంది.. మానస్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి.. మానస్కి ఇస్తే బాగుంటుందా? లేదంటే శ్రీరామ్కే ఇవ్వాలా? అని రెండు ఆలోచనలు ఉన్నాయని అన్నాడు. అయితే సన్నీ, కాజల్లు మానస్కి సపోర్ట్ చేశారు.ఈ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో మానస్ నేను మాట్లాడుకుని డిసైడ్ అవుతాం అని శ్రీరామ్ అనడంతో కాజల్ అభ్యంతరం చెప్పింది.
హౌస్ కాల్ తీసుకోమంటే.. మీ ఇద్దరూ మాట్లాడుకోవడం ఏంటని వాదించింది. దీంతో శ్రీరామ్ సీరియస్ అయ్యాడు. మానస్కి నువ్వు, సన్నీ సపోర్ట్గా ఉన్నారు. సిరి, షణ్ముఖ్ కూడా సపోర్ట్ చేయడం లేదు. అయిన అన్నింటికి మధ్యలో వచ్చి దూరిపోతావ్ ఏంటి, అనే సరికి మాటలు లూజ్ అవుతున్నావ్ బ్రో అని కాజల్ అంది. దీంతో శ్రీరామ్ బ్రో ఏంటి? బ్రో నువ్ నన్ను అలా పిలవకు అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో సన్నీ కల్పించుకుని కాజల్ని తప్పుపట్టాడు. మొత్తానికి శ్రీరామ్ మానస్కు ఛాన్స్ ఇచ్చాడు. అలా మానస్ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్ కాజల్, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు.