Sreenu Vaitla | పాతికేళ్ల క్రితం ‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తొలి సినిమానే బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం, సంతోషం అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక వెంకీతో శ్రీనువైట్ల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్లో చేరిపోయాడు. ఆ తర్వాత ఏకంగా చిరుతో అందరివాడు సినిమా చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ఫలితం తేడా కొట్టినా.. ఇప్పటికే కొంతమంది చిరు ఫ్యాన్స్కు ఇది ఫేవరేట్ సినిమా. ఆ తర్వాత మళ్లీ ఢీ, దుబాయ్ శీను, రెడి వంటి హాట్రిక్ హిట్స్తో తిరిగి ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. ఇక దూకుడుతో ఏకంగా వంద కోట్ల బొమ్మ సాధించి రికార్డు సృష్టించింది.
ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న శ్రీనువైట్ల ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే దాదాపు ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయనంతగా. బాద్షా తర్వాత శ్రీనువైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో కిందికి పడిపోయాడు. ఆయనతో సినిమా చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రావడం లేదు. గతేడాది ఢీ సీక్వెల్ను అనౌన్స్ చేసినా.. కొబ్బరికాయ కొట్టకముందే ఆగిపోయింది. మళ్లీ ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు ఇప్పటివరకు రాలేదు. కాగా తాజాగా ఆయనకు ఓ యాక్షన్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు గోపిచంద్ తొట్టెంపూడి.
కాగా ఇటీవలే శ్రీనువైట్ల, గోపిచంద్ను కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కథ చెప్పాడట. లైన్ బాగా నచ్చడంతో గోపి కూడా వెంటనే ఒకే అనేశాడట. అన్ని కుదరితే వీలైనంత త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక శ్రీనువైట్ల తన స్ట్రాంగ్ జానర్ అయిన కామెడీని ఇందులో పుష్కలంగా పొందుపరిచేలా చూసుకుంటున్నాడట. ఖచ్చితంగా ఇది పాత శ్రీనువైట్లను గుర్తుచేస్తుందని భోగట్టా. మరి ఈ ప్రాజెక్ట్ అయినా ముందుకు కదుల్తుందో లేదో చూడాలి. ఇక ఈ మధ్యనే గోపిచంద్ నటించిన రామబాణం అల్ట్రా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో భీమా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం శ్రీనువైట్లతో సినిమా చేసే చాన్స్ ఉంది.