టాలీవుడ్ బిజీ యాంకర్స్లో శ్రీముఖి ఒకరు.బుల్లితెరపై సత్తా చాటుతూనే వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ అమ్మడు గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి క్రేజీ అంకుల్స్తో కలిసి క్రేజీ అంకుల్స్ అనే సినిమా చేసింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది.
శ్రీముఖి గతంలో పలు సినిమాలలో నటించినప్పటికీ ఏ సినిమా కూడా శ్రీముఖికి పెద్దగా గుర్తింపు తేలేకపోయింది. క్రేజీ అంకుల్స్పైనే చాలా ఆశలు పెట్టుకున్న శ్రీముఖి ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చింది. నేను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుంది.ఏదైన మన ఫేట్ని బట్టి ఉంటుంది. నాకు ఇప్పుడు 28 ఏళ్లు, నాకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని ఉంది అని మనసులో మాట బయటపెట్టింది శ్రీముఖి.
శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ చిత్ర కథ ఏంటంటే .. పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారని ఆసక్తిగా చూపించనున్నారు.