Prabhas | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రశీదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో ఓ హర్రర్ చిత్రాన్ని చెయ్యబోతున్న విషయం తెలిసిందే. దీనికి ‘రాజా డిలక్స్’ అనే టైటిల్ను పరిశీలనలో ఉంచారు. ఇందులో ప్రభాస్కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇందులో ‘పెళ్ళిసందD’ ఫేమ్ శ్రీలీల ఒక హీరోయిన్గా ఎంపిక అయినట్లు సమాచారం.
యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు, మూడు నెలల్లోనే షూటింగ్ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉండగా ‘సలార్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి కావాలంటే దాదాపు రెండేళ్లయినా పడుతుంది. ఈ మధ్యలోనే ‘రాజాడిలక్స్’ చిత్రాన్ని షూట్ చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.