గత కొద్ది రోజులుగా కత్రినా కైఫ్ – విక్క కౌశల్ పెళ్లికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 9న సవాయ్ వాధోపూర్లో ఉన్న సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్లో వేద పండితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహ వేడుక సింపుల్ గా జరగనుంది. మొత్తంగా ఈ పెళ్లి కి 200 మంది వరకూ హాజరవుతున్నారు. బాలీవుడ్ నుంచి చాలా ముఖ్యమైన వారిని మాత్రమే విక్కీ-క్యాట్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నుండి ఎవరిని ఈ జంట ఆహ్వానించడం లేదని సమాచారం. అయితే మల్లీశ్వరి సినిమాతో తనను హీరోయిన్గా వెంకటేష్ పరిచయం చేయడంతో, ఆయనపై ఉన్న అభిమానంతో టాలీవుడ్ నుండి వెంకటేష్ ఒక్కరికే ఆహ్వానం పంపినట్టు సమాచారం. ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్ – రణబీర్ కపూర్ లాంటి స్టార్లను ఆహ్వానించడం లేదు. ఆ ఇద్దరూ తనకు స్నేహితులే అయినా కానీ ఆహ్వానం అందలేదనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే విక్కీ- కత్రినా పెళ్లికి పలువురు సెలబ్స్ జైపూర్కి క్యూ కట్టగా, గెస్ట్ల కోసం అక్కడే ఒక లగ్జరీ రిసార్ట్ను బుక్ చేశారట. ఆ రిసార్ట్లో లగ్జరీ టెంట్లను వేయించారని తెలుస్తుంది. ఒక గెస్ట్కు ఒక రాత్రికి ఆ రిసార్ట్ 70 వేల రూపాయలు వసూలు చేయనుందట. అది కూడా ప్రారంభ ధర అని తెలుస్తోంది. ఆ రిసార్ట్లో వీవీఐపీ గెస్ట్ల కోసం 10 లగ్జరీ టెంట్లను బుక్ చేశాడట విక్కీ. డిసెంబర్ 10 వరకు ఆ గెస్టులు ఆ రిసార్ట్లోనే స్టే చేయనున్నట్టు తెలుస్తోంది.