మార్చి 12న జరగబోయే ఆస్కార్ అవార్డులకు ట్రిపులార్ సినిమా ఎంపికైన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు పాటకు అక్కడి నుంచి నామినేషన్ దక్కింది. దాంతో త్రిబుల్ ఆర్ చిత్ర యూనిట్ మాత్రమే కాదు.. మొత్తం దేశం నాటు నాటు పాటకు డాన్సులు వేసింది. ఇదిలా ఉంటే మార్చి 12న జరగబోయే ఆస్కార్ వేడుక కోసం ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా ట్రిపులార్ టీంలో పలువురికి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. దానికంటే ముందు మరో అరుదైన ఆహ్వానం కీరవాణి, చంద్రబోస్ సొంతం చేసుకున్నారు. తాజాగా అమెరికాలో వీళ్లను లంచ్ కు ఇన్వైట్ చేస్తూ ఆస్కార్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం పంపించింది.
సాధారణంగా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన సినిమాలకు సంబంధించిన నామినీస్ అందర్నీ లంచ్ కు ఆహ్వానించడం అనే ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతుంది. అయితే ఇండియన్ సినిమాలు ఇప్పటివరకు ఫైనల్ నామినేషన్స్ వరకు వెళ్లలేదు.. కాబట్టి ఇలాంటి పద్ధతుల గురించి మన వాళ్లకు బొత్తిగా తెలియదు. తాజాగా ఆస్కార్ అవార్డులకు సంబంధించిన అధికారిక కమిటీ ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాటను రాసిన చంద్రబోస్.. ట్యూన్ చేసిన కీరవాణికి ప్రత్యేకంగా భోజన ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఫిబ్రవరి 10 రాత్రికి అమెరికా పయనం అవుతున్నారు.
ఒక రెండు మూడు రోజులు ఆగి కీరవాణి ఆయన టీం కూడా అమెరికా వెళ్ళబోతున్నారు. ఈయనతో పాటు రాజమౌళి కూడా వెళ్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏదేమైనా కూడా ఒక్క సినిమాతో తెలుగు సినిమా గౌరవం ప్రపంచ స్థాయికి చేరింది. ప్రపంచ సినిమాలో జరుగుతున్న సంగతులన్నీ ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన ఘనత మాత్రం కచ్చితంగా రాజమౌళి సొంతం. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న నాటు నాటు పాటకు.. ఖచ్చితంగా ఆస్కార్ కూడా వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ దక్కించుకుంటే 99 శాతం ఆస్కార్ కూడా వచ్చినట్టే అని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నాటు నాటు విషయంలో ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. నిజంగా అదే జరిగితే ఇండియన్ సినిమాకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు.