Actress Ishwarya Lakshmi | దక్షిణాదిలో బిజీయెస్ట్ నటిమణులలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. సౌత్ లోని అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెగ బిజీగా గడుపుతుంది ఈ కేరళ కుట్టి. ఇక గతేడాది జూన్ మాసంలో విడుదలైన గాడ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అమ్ము వెబ్ సిరీస్, పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ వంటి సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. నటిగానే కాకుండా నిర్మాతగానూ గార్గి వంటి కంటెంట్ ఓరియెంట్ సినిమాలు రూపొందించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో దుల్కర్ తో కలిసి కింగ్ ఆఫ్ కోత సినిమా చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో నటిని అవుతానంటే తన పేరెంట్స్ వ్యతిరేకించారని వెల్లడించింది.
ఐశ్వర్య లక్ష్మీ తాను MBBS చదివానని, డాక్టర్ ను కాబోయి యాక్టర్ ను అయ్యానని చెప్పింది. సినిమాల్లోకి రావడంపై తన తల్లిదండ్రులకు నెగిటివ్ అభిప్రాయం ఉందని తెలిపింది. సమాజంలో విన్న మాటల ప్రకారం సినిమా రంగంపై వాళ్లకు చెడు అభిప్రాయం ఏర్పడిందని, దాంతో యాక్టింగ్ ను గౌరవప్రదమైన కెరీర్ గా వాళ్లు భావించలేరని వెల్లడించింది. ఇప్పటికీ తన సినీ కెరీర్ వారికి ఇష్టం లేదని చెప్పింది. తన దృష్టిలో సినిమా పరిశ్రమలో కొనసాగడం అంత సులభమైన కాదని, ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తుందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.