కరోనా కష్టకాలంలో అందరికి దేవుడిగా కనిపించిన సోనూసూద్ ప్రజలందరిచే ప్రశంసలు పొందుతున్నాడు. కొందరు అతనికి గుడులు కట్టి పూజలు చేస్తుంటే మరి కొందరు వారి పిల్లలకు పేర్లు పెట్టుకుంటున్నారు. ఇంకొందరు వారి షాపులకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు సోనూసూద్పై తమ ప్రేమను కురిపిస్తున్నారు. అయితే సోనూసూద్ వీరాభిమానులు అయితే ఏకంగా ఆయనని కలిసేందుకు అనేక ప్రయత్నాటు చేస్తున్నారు.
ఇటీవల కొందరు అభిమానులు సోనూసూద్ని కలిసేందుకు పాదయాత్ర చేపట్టారు. విజయవంతంగా ముంబై నగరం చేరుకున్న వాళ్లు సోనూసూద్ ఇంటికి చేరుకొని ఆయనని చూసి చాలా సంతోషించారు. తాజాగా ఓ అభిమాని సోనూని కలవడానికి పూరీ నుండి 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశాడు. ఎట్టకేలకు సోనూ ఇంటికి చేరుకున్న సింబా అనే అభిమాని సోనూసూద్ కు పూల దండను వేసే ప్రయత్నం చెయ్యగా సోను సూద్ ఆ దండను ఆ అభిమానికే వేశాడు. ఆయనపై ఉన్న తన గౌరవానికి చిహ్నంగా సోను సూద్ పాదాల వద్ద పూలు ఉంచి సోనూసూద్ పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చెయ్యగా వద్దని వారించారు అనంతరం తన అభిమాని పాడిన పాట విని సంతోషించాడు సోనూసూద్.