శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అదితీరావుహైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు, చాలులే వేళాకోలం ఊరుకో..ఎగిసే కలలే అలలై ఎదనే ముంచేసేలే’ అనే గీతాన్ని సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. చైతన్యప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని దీప్తిపార్థసారథి ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రేమలోని మధురభావాల్ని వర్ణిస్తూ అదితీరావు హైదరీపై చిత్రీకరించిన ఈ పాట శ్రోతల్ని అలరిస్తుందని చిత్రబృందం చెబుతోంది. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమ, యాక్షన్ అంశాల కలబోతగా సాగే చిత్రమిది. ఇద్దరు యువకుల మధ్య ఉన్న స్నేహం, శత్రుత్వం నేపథ్యంలో సాగుతుంది. అక్టోబర్ 14న ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్తోట.