కేఎం ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో సంతోష్, స్నేహ, మైత్రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రుద్ర సింహ’.మనోహర్ కాటేపోగు, దర్గయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వరరావు జింకల సంయుక్తంగా నిర్మిస్తన్నారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 8న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా సుమన్, భాను చందర్ అతిథులుగా చిత్ర ఆడియోను హైదరాబాద్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కాటేపోగు మనోహర్ మాట్లాడుతూ..‘రివెంజ్ డ్రామాలో సరికొత్త అంశాలను చేర్చి ఈ సినిమా రూపొందించాము. ఏడు పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. చూసిన వారంతా ఎమోషనల్గా సినిమాతో కనెక్ట్ అవుతారు. థ్రిల్కు గురిచేసే అంశాలూ ఉంటాయి’అన్నారు. ‘చిన్న చిత్రాలకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు. ఈ సినిమాతో కమర్షియల్ అంశాలున్న ఓ కొత్త ప్రయత్నం చేశామని భావిస్తున్నాం’ అని నిర్మాత బింగి దర్గయ్య అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రేమ్, మణి, సంగీతం : రాజేష్ రాజ్ టి.