న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, మాజీ టీవీ నటి స్మృతి ఇరానీ ( Smriti Irani ) .. మళ్లీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో మంత్రి స్మృతి .. సన్నబడేందుకు వర్కౌట్ చేశారు. అయితే తాజాగా ఆ మంత్రి ఫోటోలు కొన్ని ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోట్లో మాజీ టీవీ స్టార్ స్మృతి ఇరానీ.. కొత్త లుక్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. చాలా సన్నగా అయినట్లు కూడా ఆమె దర్శనమిస్తున్నారు. తాజాగా సోమవారం రోజున ఇన్స్టాగ్రామ్లో ఆమె చేసిన ఓ పోస్ట్ తన అభిమానుల్ని అట్రాక్ట్ చేసింది. కరోనా వేళ మాస్క్ చాలా అవసరం అన్న సందేశాన్ని ఇస్తూ కొన్ని ఫోటోలు పెట్టింది. దాంట్లో మంత్రి చాలా స్లిమ్గా కనిపించారు. చెవి రింగులు, ముక్కు పుడకలు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. మాస్క్ మాత్రం కచ్చితంగా ధరించాలని తన పోస్టులో ఆమె తెలిపారు.
తన ఇన్స్టా పోస్టుపై ఫ్యాన్స్ వెరైటీగా రియాక్ట్ అయ్యారు. ఒరిజినల్ స్మృతి మళ్లీ కనిపిస్తోందన్నారు. వెయిట్ తగ్గిన తర్వాత కొత్త లుక్లో బాగున్నట్లు పోస్టు చేశారొకరు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ మ్యామ్, సో ఇన్స్పైరింగ్ అంటూ మరొకరు పేర్కొన్నారు. 2000లో ఆతిష్ షోతో స్మృతి టెలివిజన్లో ఎంట్రీ ఇచ్చారు. క్యోం కి సాస్ బి కబీ బహూతీ సిరీయల్లో ఆమె తులసి పాత్రను పోషించారు. ఆ పాత్రకు విశేషణ ఆదరణ పొందారామె. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత స్మృతి చాలా లావయ్యారు. షేప్ను కోల్పోయారు. అయితే మళ్లీ పాత షేప్లోకి రావడం పట్ల సోషల్ మీడియా ఫ్యాన్స్ .. కంగ్రాట్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.