హీరో రామ్కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించారు. 2019లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి తాజాగా పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ను ప్రకటించారు.
దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. సినిమాను ప్రకటించిన రోజునే రిలీజ్ డేట్ను వెల్లడించడం విశేషం. వచ్చే ఏడాది మార్చి 8న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారు.