రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అప్పటివరకు ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న హీరో రామ్కు కమ్బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సక్సెస్ఫుల్ కాంబోలో మరో సినిమా రానుందని గత కొద్దిరోజులగా వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఖరారైందని తెలిసింది.
‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని, ప్రస్తుతం స్క్రిప్ట్కు తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలిసింది. అక్టోబర్లో ఈ చిత్రాన్ని సెట్స్మీదకు తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్లోగా పూర్తికానుందని చెబుతున్నారు. ఆ తర్వాత పూరి-రామ్ సినిమా పట్టాలెక్కనుందని తెలిసింది.