వేవేల వెలుగుల తారకలా వెండితెరపై కొంగొత్త కాంతుల్ని వర్షించింది అగ్ర హీరో మహేష్బాబు ముద్దుల తనయ సితార. ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘ఎవ్రీ పెన్నీ..’ మ్యూజిక్ వీడియో ద్వారా ఈ గారాలపట్టి సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చింది. శనివారం ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సితార చూడముచ్చటైన నృత్యరీతులతో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చక్కటి ఈజ్తో లిటిల్ ప్రిన్సెస్ సితార చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఈ పాటలో మహేష్బాబు కూడా సందడి చేశారు. నేడు పూర్తి గీతాన్ని విడుదల చేయబోతున్నారు. ‘ఎవ్రీ పెన్నీ..ఎవ్రీ పెన్నీ లెట్స్ నో ఎవ్రీ పెన్నీ..నీదే అవనీ, నాదే అవనీ..రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ..’ అంటూ సాగే ఈ గీతానికి తమన్ స్వరాల్ని సమకూర్చారు. ‘ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. నిర్మాణ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి పాట, టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ‘పెన్నీ..’ గీతం కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. మహేష్బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది.