సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా శౌరి చంద్రశేఖర్ టి.రమేష్ దర్శకుడిగా రూపొందుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్లో జరిగాయి. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్నిచ్చారు. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ను దర్శకుడుకి అందజేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ అందమైన ప్రేమకథలో పలు సున్నితమైన పార్శాలు వుంటాయని దర్శకుడు తెలియజేశారు. ఈ చిత్రానికి మాటలు: గణేశ్ కుమార్ రావూరి, సమర్పణ:పీడీవీ ప్రసాద్.