ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ నెల 24వ తేదీన న్యూమోనియాతో ఆయన ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. కిమ్స్లో చేరిన ఆయనకు నిపుణులతో వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఐసీయూలో ఉంచామని, అక్కడే చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
‘తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఈ నెల 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నిపుణులైన డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అంద్తిన్నాం. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం’ అంటూ కిమ్స్ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.