మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇక ఇప్పుడు హోస్ట్గానే అదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రోమో కూడా విడుదలైంది.
ఈ షోకి తొలి గెస్ట్ ఎవరనే దానిపై కొద్ది రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్, రానా వంటి పేర్లు వినిపించిన చివరికి అల్లు శిరీష్ పేరు ఫిక్స్ అయింది. శిరీష్ తన ఇన్స్టాగ్రాములో తమన్నాతో కలిసి మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్ అయినందకు ఎగ్జైటింగ్గా ఉంది. షూటింగ్ కూడా పూర్తి చేసామంటూ తెలిపారు.
మరి అల్లు శిరీష్- తమన్నా తొలి ఎపిసోడ్తో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో చూడాలి.తమన్నాప్రస్తుతం సీటీమార్,ఎఫ్ 3 చిత్రాలతో బిజీగా ఉంది. మ్యాస్ట్రో చిత్ర షూటింగ్ కూడా ఈ మధ్యే పూర్తి చేసింది. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు చేయనుంది. ఇక తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్స్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్లు చేసిన తమన్నా హిందీలోను ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్టు టాక్. శిరీష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ప్రేమ కాదంట సినిమా చేస్తున్నారు.ఇందులో అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది.