అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సినం’ తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో తెరపైకి రాబోతున్నది. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్ విజయ్ కుమార్ నిర్మించారు. కుమారవేలన్ దర్శకుడు. రివేంజ్ డ్రామా కథతో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కింది.
సీహెచ్ సతీష్ కుమార్, శ్రీమతి జగన్మోహిని సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘ఇటీవల ‘ఏనుగు’ అనే చిత్రాన్ని విడుదల చేశాం. మన ప్రేక్షకులకు నచ్చే అన్ని భావోద్వేగాలు ఉన్న ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాతలు అన్నారు.