సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డ్ వేడుకలలో సైమా ఒకటి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘సైమా’ అవార్డులను (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. కరోనా వలన గత మూడేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వహించలేదు. అయితే ఈ ఏడాది హైదరాబాద్లో సైమా వేడుకని నిర్వహించనున్నట్టు ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.
తాజాగా 2019 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీలలో నామినేట్ అయిన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో ‘మహర్షి’ (తెలుగు) – ‘అసురన్’ (తమిళం) – ‘యజమానా’ (కన్నడ) – ‘కుంబలంగి నైట్స్’ (మలయాళం) చిత్రాలు సైమా నామినేషన్ లలో ముందున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ మూవీ 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిలిం ,బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ,బెస్ట్ లిరిసిస్ట్ ,బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) , బెస్ట్ విలన్ , బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీలలో నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ‘మహర్షి’ నామినేట్ అయింది.
చైతూ, సమంత ప్రధాన పాత్రలలో రూపొందిన మజిలీ చిత్రం 9 విభాగాలలో నామినేట్ కాగా, నాని- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన జెర్సీ 7 విభాగాలలో నామినేట్ అయింది. మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘కుంబళంగి నైట్స్’ ఏకంగా 13 కేటగిరీలలో నామినేట్ అవడం గమనార్హం. కన్నడ ‘యజమాన’ సినిమా 12 నామినేషన్లు పొందింది.