Param Sundari | బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తుండగా.. మ్యాడాక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మొదట జూలైలో ఈ సినిమాను విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఆగస్టు 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. సౌత్ ఇండియా – నార్త్ ఇండియా లవ్స్టోరీగా ఈ సినిమా రాబోతుంది.
SIDHARTH MALHOTRA – JANHVI KAPOOR: ‘PARAM SUNDARI’ FIRST SONG ARRIVES – 29 AUG 2025 RELEASE… Yet another melodious track from #MaddockFilms… #Pardesiya – the first song from #ParamSundari – is now LIVE.
Sung by #SonuNigam and #KrishnakaliSaha,… pic.twitter.com/YAgKn0ErJ0
— taran adarsh (@taran_adarsh) July 30, 2025