బాలీవుడ్ ప్రేమ జంటగా వార్తల్లో నిలుస్తున్నారు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. వీరిద్దరు కలిసి నటించిన ‘షేర్షా’ చిత్రం ఇటీవలే ఏడాది పూర్తి చేసుకుంది. జాతీయ పురస్కారాలు అందుకుని ఈ పెయిర్కు క్రేజ్ తీసుకొచ్చింది. మరోసారి ఈ రియల్ లైఫ్ ప్రేమికులు రీల్ లైఫ్ జంటగా కనిపించబోతున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ తరహాలో సాగే ప్రేమ కథలో కియారా, సిద్ధార్థ్ నటిస్తున్నారని సమాచారం. సునిర్ కేటర్ పాల్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించనున్నారు. ఇప్పటికే కథ లాక్ అయ్యిందని, లొకేషన్ సెర్చింగ్లో టీమ్ ఉందని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘అదల్ బదల్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ కథలో ఇద్దరి ఆత్మలు పరస్పరం మారడం కీలక అంశమని అంటున్నారు. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యతనిస్తూ చిత్రీకరణ జరపనున్నారు. కియారా, సిద్ధార్థ్ కెరీర్ పరంగా ఎవరికి వారు తీరిక లేనన్ని సినిమాలు చేస్తున్నారు. కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నది.