‘బాల నటుడిగా చాలా సినిమాలు చేశా. ‘మిణుగురులు’ చిత్రంలో నా పాత్రకు నంది అవార్డ్ కూడా వచ్చింది. అప్పుడే సినిమాలపై మరింత పాషన్ పెరిగింది’ అన్నారు దీపక్ సరోజ్. ఆయన కథానాయకుడిగా యశస్వీ దర్శకత్వంలో రూపొందిన ‘సిద్ధార్థ్రాయ్’ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర లాజికల్ ఎక్ట్స్రిమిజమ్లో ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. ఫిలాసఫీ బుక్స్ కూడా చదివాను. సిద్ధార్థ్రాయ్ ఎంత కంట్రోల్డ్గా ఉంటాడో ఒక్కసారిగా అన్కంట్రోల్డ్గా మారతాడు. సిద్థార్థ్రాయ్ లుక్ ‘అర్జున్రెడ్డి’లా కనిపిస్తుంది కానీ..ఆ సినిమాతో కథకు ఎలాంటి పోలిక ఉండదు. నటుడిగా నా ప్రతిభను చూపించడానికి ఈ క్యారెక్టర్ ఓ అద్భుతమైన అవకాశంలా ఫీలయ్యాను. తాను నమ్మిన ఫిలాసఫీ కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడిగా సిద్ధార్థ్రాయ్ పాత్ర ప్రతీ ఒక్కరికి గుర్తుండిపోతుంది. దర్శకుడు యశస్వీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ప్లేతో ఈ సినిమాను తీర్చిదిద్దాడు. త్వరలో రెండు సినిమాలు చేయబోతున్నా. మార్చి, జూన్లో అవి మొదలవుతాయి’ అన్నారు.