అక్టోబర్ 2న సమంత- నాగ చైతన్య తమ డైవర్స్కి సంబంధించిన విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు.దీంతో అభిమానులు ఆందోళన చెందారు. పలువురు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందించారు.అయితే సిద్దార్థ్ మాజీ ప్రియుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ట్వీట్ చేశారు. సిద్ధార్థ్.
తన ట్వీట్లో సమంత పేరుని ఎక్కడ పేర్కొనలేదు. కానీ సిద్ధార్థ్ మాత్రం సమంతని ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు చెప్పుకొచ్చారు.దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్. తాను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నాడు. ప్రతి రోజు ట్వీట్ చేస్తాను, అలానే ఆ రోజు కూడా చేశాను. ఇంటి బయట కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ వేస్తే.. ఎవరోవచ్చి నన్ను కుక్క అంటావా? అని అంటే తానేమీ చేయలేనని సిద్ధార్థ్ పేర్కొన్నాడు
ఆ రోజే ఎందుకు అలా చేశారని అడిగితే ఏ రోజు అని సిద్ధార్థ్ అన్నాడు. దానికి యాంకర్ సమంత డైవర్స్ రోజు అని చెప్పగా, వేరే వాళ్ల గురించి నా దగ్గర ప్రస్తావివంచొద్దు అని స్పష్టం చేశాడు.నేను ఎవరి గురించి ట్వీట్ చేయలేదు. నా జీవితంలో జరిగిందే ట్వీట్ చేశానని చెప్పుకు రావడంతో నెటిజన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు.