సోషల్మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే కథానాయికల్లో శృతిహాసన్ ఒకరు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఆమె అభిమానులతో ఎక్కువగా టచ్లో ఉంటుంది. తరచుగా చిట్చాట్లు నిర్వహిస్తూ కెరీర్తో పాటు ఎన్నో పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ భామ కొద్ది రోజుల పాటు సోషల్మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. కొన్ని రోజుల పాటు సోషల్మీడియాకు పూర్తిదూరంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. ఆర్టిస్టు శంతను హజారికాతో బ్రేక్ప్ చేసుకున్న తర్వాత శృతిహాసన్ సోషల్మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ మేకింగ్పై దృష్టి పెడుతున్నది.