అడివి శేష్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. షానీల్ డియో దర్శకుడు. హిందీ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి శృతిహాసన్ ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేశారు. ముఖంపై స్కార్ఫ్ చుట్టుకొని తీక్షణ చూపులతో సీరియస్గా కనిపిస్తున్నది శృతిహాసన్.
యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ను ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర శక్తివంతంగా ఉంటుందని, ఆమె కెరీర్లో విభిన్నమైన చిత్రమవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్, షానీల్ డియో, సహ నిర్మాత: అడివి శేష్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.