Shirya Saran | తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది శ్రియ సరన్. నాటి యువతలో ఈ భామకు మంచి క్రేజ్ ఉండేది. వివాహానంతరం కూడా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మ్యూజిక్ స్కూల్’ అనే చిత్రంలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు ‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నట్లు తెలిసింది.
ఇరవై ఏండ్ల క్రితం వచ్చిన ‘ఠాగూర్’ చిత్రంలో చిరంజీవి సరసన కథానాయికగా నటించింది శ్రియ. ప్రత్యేక గీతం కోసం చిత్రబృందం శ్రియను సంప్రదించగా ఆమె వెంటనే అంగీకరించిందని సమాచారం. ఈ పాట కోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు. ‘భోళా శంకర్’ చిత్రానికి మోహర్మ్రేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది.