Shriya Saran | చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కల్యాణ్తోపాటు ఇతర హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది శ్రియా శరణ్ (Shriya Saran). సెకండ్ ఇన్నింగ్స్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. శ్రియ సినిమాలతోపాటు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. టైం దొరికితే కుటుంబంతో సరదాగా గడిపేందుకు సమయం కేటాయిస్తుంది శ్రియ. ఈ భామ తాజాగా వెకేషన్ టూర్ వేసింది. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..? ఓ జంగిల్లోకి వెళ్లింది.
అటవీ ప్రాంతంలో చెట్ల మధ్య శ్రియ కూతురు రాధ (Radha Saran Koscheev)తో కలిసి సరదాగా ఆడుకుంటున్న విజువల్స్ ను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. 2018లో రష్యన్ బిజినెస్మెన్ ఆండ్రీవ్ కొఛీవ్ను వివాహం చేసుకుంది శ్రియ. వీరిద్దరికి 2021 జనవరిలో పాప పుట్టగా.. ముద్దుల కూతురుకు రాధా శరణ్ కొఛీవ్ పేరు పెట్టారు. శ్రియ అరుదుగా కూతురు ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తల్లీకూతుళ్లు శ్రియా-రాధ ఆట నెటిజన్లను ఇంప్రెస్ చేస్తోంది.
ఇటీవలే మ్యూజిక్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది శ్రియా. హై బడ్జెట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉపేంద్ర, సుదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కబ్జలో ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది. ఈ బ్యూటీ త్వరలోనే హిందీలో దృశ్యం ప్రాంచైజీ ప్రాజెక్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ షూటింగ్లో పాల్గొనబోతుంది.
కూతురుతో శ్రియాశరణ్ ఆట..