Shreya Dhanwanthary | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాజస్థాన్లోని జాలోర్లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. దేశ ప్రధాని పదవిలో ఉండి.. మోదీ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల నింబంధలను ఉల్లఘించి ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు విమర్శించడం మొదలు పెట్టారు.
తాజాగా తెలుగు నటి శ్రేయ ధన్వంతరి కూడా బీజేపీని విమర్శిస్తూ తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. ‘మనం ఇప్పుడు నటించడం మానేయగలమని నేను అనుకుంటున్నాను. ద్వేషం (Propaganda) అనే ప్రచారం ఇండియాలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.’ అంటూ పోస్ట్ పెట్టింది. దీనిపై కొందరు శ్రేయకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరూ విమర్శించడం మొదలుపెట్టారు. అయితే ఈ పోస్ట్లో శ్రేయ ధన్వంతరి.. మోదీ ప్రస్తావన ఎక్కడ తీసుకురాకపోయినా బీజేపీని విమర్శిస్తూ పెట్టిందని తెలుస్తుంది.
I think we can stop pretending now. The propaganda of hate is loud enough.
— Shreya Dhanwanthary (@shreyadhan13) April 21, 2024
స్నేహ గీతం (Snehageetham) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ యూట్యూబ్ లో వచ్చిన లేడీస్ రూమ్(Ladies Room) వెబ్ సిరీస్ తో ఫేమస్ అయ్యింది. అనంతరం ‘ఫ్యామిలీ మ్యాన్'(Family Man), ‘స్కాం 1992′(Scam 1992), ‘గన్స్ అండ్ గులాబ్స్'(Guns And Gulaabs) చిత్రాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించింది