‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీయార్ క్రేజ్ ప్రపంచవ్యాప్తం అయితే.. ‘కేజీఎఫ్”సిరీస్తో దర్శకుడిగా ప్రశాంత్నీల్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఇక ఆ సినిమా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరి కలయికలో సినిమా అనే వార్త వచ్చినప్పట్నుంచీ ఎప్పుడెప్పుడు సెట్స్కి వెళ్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి.
2024 ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం తారక్ ‘దేవర’ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్నీల్ ‘సలార్’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇవి పూర్తయ్యాక, వీరిద్దరి సినిమా పని మొదలవుతుంది. మైత్రీమూవీమేకర్స్, ఎన్టీయార్ ఆర్ట్స్ కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.