Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులు సోమవారం షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబా సమాధిని సందర్శించి, మధ్యాహ్నం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. షిర్డీతో పాటు ద్వారకామాయి, గురుస్థాన్ ఆలయాన్ని ఆలయాలను శిల్పాశెట్టి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పాశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. తాను సాయిబాబా భక్తురాలినని.. ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. తరుచుగా సాయిబాబా ఆశీస్సుల కోసం షిర్డీకి తరుచుగా వస్తుంటానని పేర్కొంది.
రాజ్కుంద్రాతో కలిసి నిర్మించిన ‘సుఖీ’ చిత్రం ఈ నెల 22న విడుదలకానున్నది. చిత్రం పోస్టర్ను బాబా పాదాల వద్ద ఉంచి సినిమా హిట్ అవ్వాలని బాబాను కోరుకున్నట్లు శిల్పాశెట్టి చెప్పింది. మంగళవారం నుంచి ‘సుఖీ’ సినిమా ప్రమోషన్స్ను ప్రారంభించనున్నట్లు శిల్పాశెట్టి పేర్కొంది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి.. రాజ్కుంద్రాను షిర్డీ సంస్థాన్ ట్రస్టు శాలువాతో సత్కరించింది. శిల్పాశెట్టి నటించిన ‘సుఖీ’ చిత్రానికి.. సోనాల్ జోషి దర్శకత్వం వహించారు.